శ్రీ చెంగాళమ్మ సేవలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య

50చూసినవారు
సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని శుక్రవారం చీరాల శాసన సభ్యులు యం. యం. కొండయ్య కుటుంబ సమేతముగా విచ్చేసి దర్శించుకొన్నారు. సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారి డబ్బుగుంట వెంకటేశ్వర్లు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేదపండితులచే పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం వారిని సత్కరించారు.

సంబంధిత పోస్ట్