శ్రీదేవి భూదేవిసమేత శ్రీవెంకటేశ్వరునికి చాగంటి పుష్పాభిషేకం

61చూసినవారు
శ్రీ దేవి భూదేవిసమేత శ్రీవెంకటేశ్వరునికి పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వరరావు పుష్పాభిషేకం చేశారు. ఆదివారం సాయంత్రం నాయుడుపేట పట్టణంలోని కెఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో రెండో రోజు జరిగిన నిత్య పూజా విధానం ప్రవచనామృతంలో చాగంటి సత్సంగం భక్తులు ఆయన కోసం తెచ్చిన పుష్పాలతో వేధికపై కొలువై ఉన్న శ్రీ దేవి భూదేవిసమేత శ్రీవెంకటేశ్వరునికి ఆయన పుష్పాభిషేకం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్