అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన జిల్లా కలెక్టర్

83చూసినవారు
నాయుడుపేట అంబేద్కర్ గురుకులంలో కలుషిత ఆహారం తిని ఆదివారం అస్వస్థతకు గురై స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను సోమవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంతో కలిసి పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. సకాలంలో వైద్యం అందించారా అని ఆరా తీశారు. పలు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్