తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలోని శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి దర్శనానికి వస్తారని జిల్లా
టీడీపీ నాయకులు తెలిపారు. శుక్రవారం హైదరాబాదు రాపూరు మండలం గోనుపల్లిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు మధ్యాహ్నం3. 15 చేరుకుంటారని, అక్కడనుంచి పెంచలకోనకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం తిరిగి ఉండవల్లికి వెళ్తారని తెలియజేసారు.