సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం చాలా తక్కువగా ఉందని, ప్రతి ఒక్కరూ కీలకంగా పనిచేయాలని వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణం లోని నేదురుమల్లి భవనంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులకు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ పది రోజులు కీలకమన్నారు. నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో కలసి పనిచేయాలన్నారు.