AP: ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీ అతుల్ సింగ్ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా నియమించింది. విశాఖ సీపీగా ఉన్న రవిశంకర్ అయ్యన్నార్ను సీఐడీ అదనపు డీజీగా, శాంతిభద్రతల అదనపు డీజీగా ఉన్న శంకబ్రత బాగ్చిని విశాఖ సీపీగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.