సీఎం చంద్రబాబు డ్రైవర్కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఓ డ్రైవర్కు ఎలక్ట్రిక్ ఆటో అందజేశారు. గుడివాడలో ఇటీవల అన్న క్యాంటీన్ ను సీఎం చంద్రబాబు పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. క్యాంటీన్ ప్రారంభ సభలో బ్యాటరీ ఆటో సమకూరుస్తానని ఆటో డ్రైవర్ రజినీకాంత్కు చంద్రబాబు హామీ ఇచ్చారు. గంటల వ్యవధిలో రజినీకాంత్కు రూ.3.9 లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను అధికారుల చేత సీఎం అందజేశారు.