ఓట్లు లెక్కింపు నేపథ్యంలో ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని చీపురుపల్లి సిఐ షణ్ముఖరావు అన్నారు. ఎస్సై భాస్కర్ రావు తో కలిసి ఆయన గుర్ల మండలం దమరసింగి, శ్యామలంబ గ్రామాల్లో శనివారం. ప్రజలకు అవగాహన కల్పించారు. కౌంటింగ్ రోజు బాణసంచా కాల్చడం, ర్యాలీలు నిర్వహించడం నిషేధించడమైనదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ గొడవలకు ప్రజలు దూరంగా ఉండాలని కోరారు.