జామిలో వెలసిన శ్రీ ఎల్లారమ్మ తల్లిని గురువారం వివిధ రకాల కాయగూరలతో ఆలయ అర్చకులు శాకాంబరి అమ్మవారిగా అలంకరించారు. గురుస్వామి మూర్తి ఆధ్వర్యంలో. అర్చకులు వేకువ జాము నుండి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కుంకుమ పూజలు జరిపారు. అనంతరం ఆలయ సిబ్బంది భక్తులకు ప్రసాదం పంపిణి చేశారు.