రామచంద్ర స్వామికి పునర్వసు పట్టాభిషేకం

51చూసినవారు
రామతీర్థం రామచంద్ర స్వామి వారి దేవాలయంలో స్వామివారికి శనివారం పునర్వసు పట్టాభిషేకం నిర్వహించారు. ప్రాతః కాలార్చన బాలభాగం అనంతరం యాగశాలలో సుందరకాండ హవనం నిర్వహించి ఉత్సవ మూర్తులు వద్ద నిత్య కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్బంగా రామచంద్ర స్వామి వారిని విశేషంగా పుష్పాలతో అలంకరణ చేశారు. కార్యక్రమంలో పట్టాభిషేకం నిర్వహించుకొన్న భక్తులు కార్యనిర్వహణ అధికారి వై శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్