పార్వతీపురంలో ఆటోను ఢీకొన్న లారీ

3258చూసినవారు
పార్వతీపురం సమీపంలో ఉన్న నర్సిపురం జనహిత స్కూల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం 4 గంటల సమయంలో పార్వతీపురం నుంచి మరిపవలస వైపు వెళ్తున్న ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో ఆటో డ్రైవర్తో పాటు ముగ్గురు గాయపడ్డారు. స్థానికంగా ఉన్న పశువుల కాపరులు క్షతగాత్రులను పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీతో డ్రైవర్ పరారయ్యాడని, ఘటనపై పోలీసులకు సమాచరం అందించినట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్