ధోలీపై తరలిస్తుండగా ప్రసవించిన మహిళ

3307చూసినవారు
పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను ఆసుపత్రికి గిరిజనులు డోలిపై తరలిస్తుండగా మార్గమధ్యంలో మహిళ ప్రసవించిన సంఘటన ఎస్. కోట మండలంలో గురువారం చోటు చేసుకుంది. రేగ పుణ్యగిరి కి చెందిన వి. కుసాయి నిండు గర్భిణీ కావడంతో డోలీపై ఎస్. కోట ఆసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలో మార్గమధ్యంలో మహిళ ప్రసవించింది. తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇక్కట్లకు గురవుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్