వరద బాధితులకు అండగా నిలవండి

76చూసినవారు
ఇటీవల విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తడంతో భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. సోమవారం బొబ్బిలిలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ విజయవాడ ప్రజలకు బొబ్బిలి నియోజకవర్గం తరుపున అండగా నిలిచేందుకు విరాళాలు సేకరిస్తున్నామని, చాలా మంది దాతలు స్పందిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు రావాలని కోరారు. వీరి కోసం అండగా నిలిచి సహాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్