మరమ్మత్తులు చేపట్టకపోతే ముట్టడి

72చూసినవారు
మెంటాడ రహదారికి మరమ్మతులు చేపట్టకపోతే రహదారులు భవనాల శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సిపిఎం నాయకులు జి. శ్రీనివాస్ హెచ్చరించారు. గురువారం రోడ్లు మరమ్మత్తులు చేపట్టాలని కోరుతూ శ్రీనివాస్ పర్యవేక్షణలో పలువురు రాస్తారోకో చేపట్టారు. ఈ రోడ్డులో భారీ వాహనాలు వెళ్లడం వలన అడుక్కో గొయ్యి ఏర్పడిందన్నారు. దీంతో పాదచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాకోటి రాములు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్