రైల్వే మూడో లైన్ పనులు పరిశీలన

62చూసినవారు
రైల్వే మూడో లైన్ పనులు పరిశీలన
దత్తిరాజేరు మండలంలోని కోమటిపల్లి -మరడాం మధ్యలో జరుగుతున్న రైల్వే మూడో లైన్ పనులను రైల్వే ఏ. జి. యం నర్సింగరావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిరిండోల్ నుంచి విజయనగరం వరకు రైల్వే మూడో లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే చాలా మేరకు పట్టాలు వేయడం పూర్తయిందన్నారు. కోమటిపల్లి వద్ద కొత్త రైల్వే స్టేషన్ పనులు నెలాఖరికి పూర్తిచేయాలని కాంట్రాక్టర్ కు ఆదేశించామన్నారు.

సంబంధిత పోస్ట్