చెట్లు నరికిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

51చూసినవారు
గంట్యాడ రహదారి ప్రక్కన గల కదంబం, నేరేడు చెట్లను విద్యుత్ శాఖ సిబ్బంది మొదలకే నరికివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ పర్యావరణ వేత్త బొబ్బిలి రామకృష్ణ ఈ సంఘటనపై సోమవారం స్పందిస్తూ విద్యుత్ తీగలకు అడ్డం వచ్చిన కొమ్మలను మాత్రమే తొలగించాలని, చెట్టు తొలగించాలంటే సంబంధిత శాఖ అధికారుల నుండి అనుమతి తప్పనిసరని అన్నారు. చెట్లు నరికిన వారిని చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్