విజయనగరం జిల్లా, గజపతినగరం మండలంలోని కాలంరాజుపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ గేదల ఈశ్వరరావు పైప్ లైన్ మరమ్మతు పనులను సోమవారం యుద్ధ ప్రాతిపదికన చేయించారు. ప్రజలకు మంచినీటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు మరమ్మత్తు పనులు చేయించామని సర్పంచ్ ఈశ్వరరావు తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.