పంచాయతీ అభివృద్ధిలో వార్డు సభ్యుల సహకారం అవసరం

74చూసినవారు
పంచాయతీ అభివృద్ధిలో వార్డు సభ్యుల సహకారం అవసరమని గజపతినగరం జడ్పిటిసి గార తౌడు అన్నారు. సోమవారం గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో వార్డు సభ్యులకు రెండు రోజులపాటు జరిగే శిక్షణా కార్యక్రమాన్ని తౌడు జ్యోతి ప్రజ్వలన గావించారు. ఎంపీడీవో బి.కళ్యాణి మాట్లాడుతూ.. లే అవుట్ల కు అనుమతులు తప్పనిసరి అన్నారు. ఈవో పి ఆర్ డి సుగుణాకరరావు, శిక్షకులు జనార్దనరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్