సుభద్రమ్మవలసలో ఏనుగుల గుంపు
జియ్యమ్మవలస మండలంలోని సుభద్రమ్మవలస పరిసరాల్లో ఏనుగులు గుంపు సోమవారం సంచరించాయి. ఉదయమంతా వరి, అరటి, పామాయిల్, మొక్కజొన్న పంటల్లో సంచరించిన ఏనుగులు గుంపు మధ్యాహ్న సమయానికి చెరువులోకి చేరుకుని సేదతీరాయి. అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని చుట్టూ పక్క ప్రాంతాల రైతులు కోరుతున్నారు.