పదేళ్లు మాదే అధికారం: సీఎం రేవంత్‌రెడ్డి

75చూసినవారు
పదేళ్లు మాదే అధికారం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో పదేళ్లు తమదే అధికారమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అరాంఘర్‌లో ప్రొఫెట్ ఫర్ ది వరల్డ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామని, మిగతా సమయంలో అభివృద్ధిపైనే దృష్టిసారిస్తామని ఆయన చెప్పారు. పార్లమెంట్‌లో అసదుద్దీన్ ఓవైసీ పేద ప్రజల పక్షాన గళమెత్తడం చూస్తే.. గర్వంగా ఉంటుందని పేర్కొన్నారు. అన్నివర్గాల్లోని పేదలను ప్రజాప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్