జియ్యమ్మవలసలో రైతు అవగాహన సదస్సు
గ్రామీణ వ్యవసాయ పనుల అనుభవ కార్యక్రమం కోర్సులో భాగంగా గురువారం గవరంపేట గ్రామంలో వ్యవసాయ కళాశాల, నైరా విద్యార్థులు రైతు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం, రస్థకుంటుబాయి శాస్త్రవేత్తలు మరియు నైరా కళాశాల అధ్యాపకులు డా. బి జ్యోతిబసు పాల్గొని రైతుల సమస్యలు తెలుసుకొని వాటికి తగిన పరిష్కారాలు తెలియజేశారు.