జాతీయ స్థాయిలో మార్కొండపుట్టి యువకునికి 4వ స్థానం

52చూసినవారు
జాతీయ స్థాయిలో మార్కొండపుట్టి యువకునికి 4వ స్థానం
ఎయిమ్స్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య విద్య సూపర్ స్పెషాలిటీ కోర్సులలో న్యూరాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో డాక్టర్ శంబంగి రవిచంద్ ఆదివారం నాలుగవ ర్యాంకు సాధించాడు. కొమరాడ మండలం మార్కొండపుట్టి గ్రామానికి చెందిన రవిచంద్ హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఇతని తండ్రి తిరుపతిరావు వ్యవసాయం చేస్తుండగా తల్లి జ్యోతీశ్వరి గవర్నమెంట్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్