కురుపాం నియోజకవర్గంలో ఏనుగుల బెడద వీడడం లేదు. సోమవారం జియ్యమ్మవలస మండలం గవరమ్మపేట వద్ద ప్రధాన రహదారిపై ఏనుగు హల్ చల్ చేసింది. దాంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటవీశాఖ అధికారులు వచ్చి ఏనుగును పొలాల్లోకి తరలించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఏనుగుల సమస్యను తీర్చాలని కోరుతున్నారు.