వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయండి: కొల్లి సాంబమూర్తి

65చూసినవారు
వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయండి: కొల్లి సాంబమూర్తి
నాగావళి నదిపై కొమరాడ మండలంలోని పూర్ణపాడు -లాబేసు గ్రామాల మధ్య వంతెన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీపీఎం పార్టీ నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన వంతెన నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంతెన నిర్మాణ పనులు 70 శాతం పైగా పూర్తయినప్పటికీ మిగిలిన పనులు చేయడంలో జాప్యం జరుగుతోందన్నారు. తక్షణమే పనులు పూర్తి చేసి రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్