ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించిన కండక్టర్

4238చూసినవారు
పార్వతీపురం నుండి కునేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కునేరు బస్ స్టాప్ కు వెళ్లకుండా కునేరుకు సమీపంలో ఆపేసి ప్రయాణికులను దింపేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కండక్టర్ ప్రయాణికులతో నిర్లక్ష్యంగా మాట్లాడుతూ, దురుసుగా ప్రవర్తించారని వాపోయారు. మేము భోజనం చేశాకే బస్ స్టాప్ కి వెళ్తాము నచ్చితే వుండండి లేదంటే దిగి వెళ్ళిపొండి అని కండక్టర్ అంటున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్