మత్తు పదార్థాలపై అవగాహన ర్యాలీ

62చూసినవారు
గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేట సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో మత్తుపదార్థాల వినియోగం వలన కలిగే అనర్థాలు, దుష్ప్రభావాలు గురించి యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో బుధవారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ యువత, ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్