ముమ్మరంగా యాంటీ లార్వా స్ప్రేయింగ్

56చూసినవారు
ముమ్మరంగా యాంటీ లార్వా స్ప్రేయింగ్
కురుపాం మండలంలో ముమ్మరంగా యాంటీ లార్వా స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ తెలిపారు. గురువారం మండలంలోని ఊసకొండ, గొత్తిలి గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో దోమలు వృద్ధి చెందకుండా నీరు ఉండే ప్రదేశాలలో యాంటీ లార్వా స్ప్రే చేయించారు. ప్రతి ఒక్కరూ తమ తమ పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్