కొమరాడ మండలం మసిమండ పంచాయతీ జాకూరు గ్రామంలో ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో 90 కుటుంబాలు, సుమారు 400 మంది గిరిజనులు ఉన్నప్పటికీ, గ్రామంలో ఒకటే చేతి బోరు ఉండటం వల్ల నీటి కష్టాలు ఎదుర్కొంటున్నట్లు గిరిజనులు సోమవారం తెలిపారు. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి, తమ గ్రామానికి మరొక బోరు బావి ఏర్పాటు చేసి, తాగునీటి కష్టాలు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు.