పాలకొండలో పర్యటించిన జిల్లా కలెక్టర్

79చూసినవారు
మన్యం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పర్యటించారు. డివిజన్ కేంద్రంలోని నీలమ్మ కాలనీ మినీ అంగన్వాడీ, చిన కాపు వీధిలోని కాలువలను కలెక్టర్ పరిశీలించారు. మే నెలలో పారిశుద్ధ్యంపై ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ డివిజన్ కేంద్రంలో కాలువల్లోని పూడికలు తోలగించకపోవడంపై నగర పంచాయతీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్