పంట పొలాలు ధ్వంసం చేస్తున్న ఏనుగులు

1899చూసినవారు
భామిని మండలంలోని బాలేరులో ఆదివారం సాయంత్రం 4 ఏనుగులు పంట పొలాల్లో ఉన్నాయని స్థానికులు సోమవారం తెలిపారు. మొన్నటి వరకు తాళాడలో ఉన్నాయని అన్నారు. మూడు రోజుల నుంచి బాలేరు ప్రాంతంలో తిరుగుతున్నాయని తెలిపారు. పలువురు రైతుల వరిపంట, అరటి తోటలు, ధ్వంసం చేస్తున్నాయని అన్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో నీళ్లు, ఆహారం, కోసం చేరుకుంటున్నాయని, సంబంధిత అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్