నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ

79చూసినవారు
నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ
పెండింగ్‌ కేసులపై దృష్టి సారించి నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని మన్యం జిల్లా ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. బుధవారం పార్వతీపురం పోలీస్‌ మల్టీ ఫంక్షన్‌ హాల్‌లో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెండింగ్‌లో ఉన్న గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌ కేసులపై ఆరా తీశారు. పోలీస్‌ స్టేషన్ల వారీగా యూఐ కేసులు తగ్గించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్