వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పొలం పిలుస్తోంది పోస్టర్లను జిల్లా కలెక్టర్ బి. ఆర్. అంబేద్కర్, జెసి ఎస్. సేతుమాధవన్ సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. జిల్లా వ్యవసాయ అధికారి వి. టి. రామారావు మాట్లాడుతూ ప్రతి మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు వ్యవసాయ సిబ్బంది రోజుకు రెండు గ్రామాల్లో పర్యటించి అధునాతన సాగు పద్ధతులపై రైతులకు యీ కార్యక్రమం ద్వారా వివరిస్తారన్నారు.