జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిగా సాయి కృష్ణ చైతన్య

70చూసినవారు
జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిగా సాయి కృష్ణ చైతన్య
పార్వతీపురం మన్యం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిగా సాయి కృష్ణ చైతన్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. కాగా ఈయన విశాఖ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ పని చేసిన సాయికుమార్ శ్రీకాకుళం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిగా బదిలీపై వెళ్లారు.

సంబంధిత పోస్ట్