ప్రభుత్వ మహిళా కళాశాల శ్రీకాకుళం నందు పనిచేస్తున్న కంప్యూటర్ అప్లికేషన్స్ అధ్యాపకురాలు ఎస్ వాణి కుమారికి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతి వారు గురువారం డాక్టరేట్ ప్రధానం చేశారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. సూర్యచంద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వాణికుమారికి అభినందనలు తెలిపారు. ప్రొఫెసర్ కే. ఉషారాణి ఆధ్వర్యంలో వాణీ కుమారి పరిశోధన చేశారు. కళాశాలలోని అధ్యాపక బృందం ఆమెకు అభినందనలు తెలిపారు.