జయతిలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జోత్సవాలు

77చూసినవారు
మెంటాడ మండల కేంద్రమైన జయతి గ్రామం లో గణేష్ నిమజ్జోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని తొమ్మిది రోజులపాటు విశిష్ట పూజలు అందుకున్న గణేశునికి వీడ్కోలు పలికారు. సోమవారం గ్రామంలోని పెద్దలు, పిల్లలు సైతం ఈ ఆది దేవుని నిమజ్జనోత్సవాలలో పాల్గొన్నారు. గణేష్ నిమర్జనం ఉత్సవాలలో ఊరువాడ ఏకమై గణేష్ నిమజ్జనం అత్యంత వైభవంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్