రాజన్న దొర గెలుపే లక్ష్యంగా వైసిపి నాయకులు విస్తృత ప్రచారం
జగనన్న చేసిన అభివృద్ధి రాష్ట్రంలో ఏ. సీఎం చేయలేదని నవరత్నాలతో ఇంటికే సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసిపి ప్రభుత్వానిదే సాలూరు పట్టణ జే సి ఎస్ కన్వీనర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గిరి రఘు అన్నారు. సాలూరు పట్టణంలో బుధవారం 22 వ వార్డు చాకలివీధి, పలు వార్డులలో డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, ఎం పి అభ్యర్థి ల గెలుపు లక్ష్యంగా వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించారు.