సాలూరు పట్టణంలోని ఐదు ఆలయాలకు ఇఒగా టి. రమేష్ను నియమిస్తూ దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇఒ రమేష్ సోమవారం ఐదు ఆలయాల్లో ప్రమాణస్వీకారం చేశారు. దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ ఇఒ రమేష్చే ప్రమాణం చేయించారు. సీతారామ స్వామి ఆలయం, పంచముఖేశ్వర స్వామి ఆలయం, జగన్నాథస్వామి ఆలయం, సువర్చలా సహిత ఆంజనేయస్వామి వారి ఆలయం, రాధాకృష్ణ ఆలయాలకు ఇఒగా రమేష్ బాధ్యతలు స్వీకరించారు.