మెట్ట పంటలు పండించే రైతులు జూన్ మూడవ వారాన్ని ఎంపిక చేసుకొని విత్తనాలు నాటాలని, లేదంటే పలు రకాలుగా నష్ట పోయే ప్రమాదం ఉందని సాలూరు మండల వ్యవసాయ శాఖ అధికారిణి(ఏఓ)అనురాధ పండా అన్నారు. శనివారం సాలూరు మండలంలోని శివరాం పురం గ్రామం పరిధిలోని జరజాపు ముసలి నాయుడు, ఆనాపు నరసింహులు, బొడ్డు ఆదినారాయణ, జరజాపు పైడిపునాయుడు తదితరులు సాగు చేస్తున్న పత్తి, మొక్కజొన్న తదితర మెట్ట పంటలను పరిశీలించారు