క్వారీ పై నుండి జారిపడి ఓ వ్యక్తి మృతి

1932చూసినవారు
క్వారీ పై నుండి జారిపడి ఓ వ్యక్తి మృతి
ఎస్ కోట మండలం ధర్మవరం మల్లేశ్వర స్వామి క్వారీ పై నుండి జారిపడి ధర్మవరం కు చెందిన లోతేటి అప్పారావు శుక్రవారం మృతి చెందాడు. మృతుడు క్వారి పై భాగంలో నడుంకు తాడు కట్టుకుని పనిచేస్తున్నాడు. పనిచేస్తున్న సమయంలో అప్పారావు అకస్మాత్తుగా క్వారీ పై నుండి జారడంతో నడుంకు కట్టుకున్న తాడు మెడకు చుట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్