రోడ్డు ప్రమాదంలో ఎల్ కోటకు చెందిన మహిళ మృతి

2909చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఎల్ కోటకు చెందిన మహిళ మృతి
ఎల్ కోట మండలం గనివాడ కు చెందిన సామర్ల నవ్య (40) తన కుమార్తె ఝాన్సీ ని నారాయణ స్కూల్లో జాయిన్ చేసేందుకు తన కుమారుడితో కలసి బైక్ పై శుక్రవారం వెళ్లారు. విశాఖ జిల్లా ఆనందపురం సమీపంలో గల సాధుమఠం వద్ద విశాఖ నుండి వస్తున్న లారీ వెనుక నుండి బైకును ఢీకొట్టింది. దీంతో నవ్య లారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన ఆమె కుమారుడు, కుమార్తెను విశాఖ ఎన్నారై ఆస్పత్రిలో వైద్య చికిత్స నిమిత్తం చేర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్