ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి

54చూసినవారు
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన రైతు భరోసా హామీని అమలు చేసి రైతులను ఆదుకోవాలని వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగనాయుడు ఆధ్వర్యంలో బుధవారం జియ్యమ్మవలస సచివాలయ కార్యదర్శికి రైతులు వినతి పత్రం అందజేశారు. రైతులు ఖరీఫ్ పంటల సాగు ప్రారంభించి మూడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం పెట్టుబడి సాయం ప్రకటించలేదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్