గోస్తనీ నదిలో లభ్యమైన గల్లంతైన మృతదేహం

53చూసినవారు
గోస్తనీ నదిలో లభ్యమైన గల్లంతైన మృతదేహం
జామి మండలంలోని గోస్తనీ నదిలో ఆదివారం గల్లంతైన కొత్తలి దేవుడు (65) మృతదేహం సోమవారం మధ్యాహ్నం నాటికి లభ్యమైంది. కాగా పశువులు కాస్తుండగా మృతుడు గోస్తని నదిలో దిగి గల్లంతైన విషయం విధితమే. మృతుడు ఆచూకీ కోసం ఎమ్మార్వో కృష్ణ లత ఆధ్వర్యంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం దేవుడు నదిలో శవమై తేలడంతో స్థానికులు సహకారంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఎస్. కోట పీహెచ్సీకి తరలించారు.

సంబంధిత పోస్ట్