వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టేది టిడిపి ప్రభుత్వమేనని, ఎస్. కోట నియోజకవర్గంలో గెలిచేది నేనే, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తెచ్చేది నేనే అని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి అన్నారు. వేపాడ మండలం పాటూరు, కాకులపాలెం గ్రామాల్లో ఆదివారం రాత్రి ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టిడిపి మేనిఫెస్టోలో హామీలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపుకు ప్రజలు కృషి చేయాలని కోరారు.