వేపాడ మండలం సింగరాయి నుండి ఆదివారం ఓ ట్రాక్టర్ పై గడ్డిను తరలిస్తున్న నేపథ్యంలో సోంపురం మీసేవ వద్దకు వచ్చేసరికి కరెంటు తీగను గడ్డి తాకడంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి. కాగా ట్రాక్టర్ డ్రైవర్ దగ్ధమవుతున్న గడ్డిలోడును చాకచక్యంతో పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పిలుచుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.