2-3 రోజుల్లో 5లక్షల టన్నుల ఉల్లి సేకరణ

71చూసినవారు
2-3 రోజుల్లో 5లక్షల టన్నుల ఉల్లి సేకరణ
ఎగుమతులపై నిషేధాన్ని పొడిగించడం వల్ల మార్కెట్లో ఉల్లి ధర పడిపోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కేంద్రం మంగళవారం స్పందించింది. 2-3 రోజుల్లో 5లక్షల టన్నుల రబీ ఉల్లిని కొనుగోలు చేసి, అన్నదాతల ప్రయోజనాలను కాపాడతామని తెలిపింది. ఉల్లి ఎగుమతులపై ఈ నెల 31 వరకూ నిషేధం ఉన్నా.. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ ఈ నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు గతవారం ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్