నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ సదానంద్ వసంత్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీంతో పాటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ పీయూష్ ఆనంద్, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ & డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ పదవిలో రాజీవ్ కుమార్ శర్మ నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.