అచ్యుతాపురం పేలుడుపై ఉన్నత స్థాయి విచారణ: సీఎం

55చూసినవారు
అచ్యుతాపురం పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ వేస్తున్నామని సిఎం చంద్రబాబు ప్రకటించారు. గురువారం విశాఖకు వెళ్లిన ముఖ్యమంత్రి అచ్యుతాపురం సెజ్‌ లోని పేలుడు ఘటనలో తీవ్రగాయాలపాలైన బాధితులను పరామర్శించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదం చోటు చేసుకున్న ఫార్మా పరిశ్రమను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. అనకాపల్లి అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

సంబంధిత పోస్ట్