విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం ఆచార్యులు చల్లా రామకృష్ణ ప్రెస్, మీడియా రిలేషన్స్ విభాగం డీన్గా నియమితులయ్యారు. శుక్రవారం ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. కిషోర్ బాబు నుంచి ఉత్తర్వులను స్వీకరించారు. అనంతరం ఆచార్య చల్లా రామకృష్ణను వీసీ ఆచార్య జి. శశిభూషణ రావు అభినందించారు. ఆచార్య చల్లా రామకృష్ణ పర్యవేక్షణలో ఇప్పటి వరకు 23 మంది డాక్టరేట్లు అందుకున్నారు.