అమ్మవారి ఆలయంలో చోరీ

2882చూసినవారు
అమ్మవారి ఆలయంలో చోరీ
దేవరాపల్లి మండలం కలిగొట్ల గ్రామంలో గత అర్థరాత్రి సమయంలో అమ్మవారి యొక్క హుండీని పగలగొట్టి హుండీలో సొమ్మును కాజేసినట్లు స్తానికులు తెలిపారు. గుడి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ వాటి యొక్క వైర్లను తప్పించి, సునాయాసంగా దొంగతనానికి పాల్పడ్డారు. ఈ హుండీలో సుమారుగా కనీసం యాభైవేల రూపాయల ఉండవచ్చునని గ్రామ ప్రజలుఅంచనా. ఈ అమ్మవారిని గ్రామ ప్రజలుగాక చుట్టుప్రక్కల గ్రామాల వారు వచ్చి ప్రతి మంగళవారం అమ్మవారికి తమ తమ మొక్కులు చెల్లించుకుంటారు. పాలధార తల్లిగా అమ్మవారి ప్రసిద్ధి చెంది ఎన్నో పూజలు అందుకుంటూ వుంటారు. ఈ విషయం తెలియగానే గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామ గ్రామాల వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్