గొలుగొండ మండలం చోద్యం గ్రామంలో సోమవారం జగనన్న కాలనీ ఇళ్ల పట్టాలను నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల భాస్కర్ నాయుడు, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు 52మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం ఇళ్లను అందిస్తుందన్నారు. పేదల సొంతింటి కల వైసీపీ ప్రభుత్వంలో సాకారమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మణికుమారి, వైస్ ఎంపీపీ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.